mt_logo

కేసీఆర్ కుటుంబాన్ని కించపరిస్తే ఊరుకోం- స్వామిగౌడ్

తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్ గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడితే ఊరుకునేదిలేదని, అలా మాట్లాడితే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమ ఫలితంగానే కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవులు వచ్చాయని, పొన్నాలకు పీసీసీ పదవి కూడా అందుకే దక్కిందని విమర్శించారు. అమరవీరుల గురించి మాటాడే అర్హత కూడా పొన్నాలకు లేదని పేర్కొన్నారు. సకల జనుల సమ్మె జరిగినప్పుడు పొన్నాల ఎక్కడ దాక్కున్నాడని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *