mt_logo

ఇక సండే-ఫండే మధ్యాహ్నం 3 గంటలకే ప్రారంభం

గత నెలలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఓ నగర పౌరుడి అభ్యర్థన మేరకు గత నెల 29వ తేదీ నుంచి ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సండే-ఫండే నిర్వహిస్తూ సందర్శకులను అనుమతిస్తుండగా…అది చాలా సక్సెస్ అయింది. తాజాగా హైదరాబాద్ నగర ప్రజలు ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకరమైన వాతావారణంలో ఇంకాస్త ఎక్కువ సమయం గడిపేందుకు ఈ ఆదివారం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షల సమయాన్ని పెంచుతున్నారు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల రాకపోకలు నిషేధిస్తూ, ఆ సమయంలో కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. దీంతో సందర్శకులు ఆదివారం పగటి వేళల్లో కూడా మరింత సమయం ట్యాంక్‌బండ్‌పై గడిపేందుకు అవకాశముంటుందని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు కొద్దిసేపు ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో గడిపేందుకు సమయం కలిసి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ట్యాంక్‌బండ్‌ పై జరిగే సండే-ఫండే కు వచ్చే సందర్శకుల కోసం అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను లేపాక్షి వద్ద, రాణిగంజ్‌ వైపు నుంచి వచ్చే వారు చిల్డ్రన్‌ పార్కు వద్ద, ట్యాంక్‌బండ్‌కు ఇరువైపుల పార్కింగ్‌ చేసుకునే విధంగా ఇప్పటికే పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. సాధారణ వాహనదారులు ఆదివారం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్యాంక్‌బండ్‌కు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *