mt_logo

కొనసాగుతున్న హుజురాబాద్ ఉపఎన్నికల ఓటింగ్.. బారులు తీరిన ఓటర్లు

హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ రాత్రి 7 గంటలకు ముగియనుండగా.. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్‌ నమోదయింది. శనివారం తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో బారులు తీరారు. హుజూరాబాద్‌లో మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. కాగా, పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *