వైసీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కన్డువాను కప్పి గోవర్ధన్ ను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ, ‘ఇల్లు అలకగానే పండగ కాదని, తెలంగాణ ప్రజల కోటి ఆశలు నెరవేరాలని, ఆంధ్రా పార్టీల చేతిలో మోసపోతే గోసపడుతామని’ అన్నారు. పార్టీ క్యాడర్ ప్రజలకు అన్ని విషయాలు తెలపాలని, తెలంగాణ కోసం ఎవరు కొట్లాడారో వారి చేతిలోనే అధికారం ఉండాలని, అప్పుడే తెలంగాణ ప్రజల కోరికలు, కలలు తీరుతాయని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు ఇద్దరూ తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సమైఖ్యాంధ్ర ముఖ్యమంత్రులు ఉద్యమాన్ని ఎగతాళి చేశారని, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మనం చూడనివా అని, ఆ పార్టీలకు ఓటు వేస్తే మనం మోసపోతామని చెప్పారు. తెలంగాణపై వైసీపీ వ్యతిరేకత వ్యక్తం చేసినప్పుడు మొదటగా కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి రాజీనామా చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. ఒకప్పుడు అత్యంత ధనవంత జిల్లాల్లో నిజామాబాద్ ఒకటని, ఇప్పుడు అదే జిల్లాలో కరువు తాండవిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు అని, సీమాంధ్ర పెత్తందారులవల్ల ప్రాజెక్టుకు నీళ్ళురాకుండా అయ్యిందని విమర్శించారు.
- Godse is sitting in Gandhi Bhavan: BRS Working President KTR in Banswada
- CM KCR is a fighter who would never associate with a cheater like Modi: KTR
- RSS man heading Congress in Telangana: BRS Working President KTR
- Desertions rock the Congress party as the elections near
- Modi’s speech a bundle of lies: Minister KTR
- బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: మంత్రి హరీశ్ రావు
- నిర్మల్లో రూ.1157 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్
- నిర్మల్ జిల్లాలో రూ. 300 కోట్లతో నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ హయాంలో తాగునీరు లేదు.. బీఆర్ఎస్ పాలనలో కరువు లేదు: మంత్రి కేటీఆర్
- మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంటాయి: మంత్రి హరీశ్ రావు
- ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం
- సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు రైలు
- బీఆర్ఎస్ మీద ప్రధాని చేసిన అసత్య ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్
- ఈనెల 5న విజయ మెగా డెయిరీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం
- గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్