mt_logo

రైతులు 15 రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనడం లేదు: హరీష్ రావు

సిద్దిపేట నియోజకవర్గంలోని పెద్దకోడూర్ గ్రామ పరిధిలోని మెట్టుబండల వద్ద గల మాజీ మంత్రి హరీష్ రావు పంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. 15 రోజుల నుండి వడ్లు పెట్టుకొని ఇక్కడే ఉంటున్నామని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..రైతులు అధైర్యపడొద్దు.. తొందరపడి తక్కువ ధరకు అమ్మకండి. రూ. 2,203 రూపాయలు మద్దతు ధర ఇప్పిస్తా తక్కువ ధరకు అమ్మొద్దు. అధికారులతో మాట్లాడుతా.. అండగా ఉంటా రైతులు అధైర్యపడొద్దు అని ధైర్యం చెప్పారు.

రైతులు 15 రోజులుగా కేంద్రంలో ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనడం లేదు.. వర్షంతో ధాన్యం తడిచింది. ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి అని అన్నారు.

కేసీఆర్ హయాంలో ఇలాంటి కష్టాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి.. మోటార్లు కాలిపోతున్నాయి.. రైతుబంధు పడడం లేదు అని హరీష్ పేర్కొన్నారు.

అనంతరం అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, డీఎం సివిల్ సప్లై, ఐకేపీ అధికారులతో మాట్లాడి ..వెంటనే వడ్ల కొనుగోలు ప్రారంభించాలని హరీష్ రావు అధికారులను కోరారు.