mt_logo

ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం: హరీష్ రావు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు .కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నది. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయి. ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది అని పేర్కొన్నారు.

రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలి. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.