![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-30-at-2.52.34-PM.jpeg?resize=1200%2C675&ssl=1)
సన్ఫ్లవర్ పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రవ్యాప్తంగా సన్ఫ్లవర్ పండించిన రైతులు మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం మద్దతు ధర రూ. 6,760 ఉండగా.. మార్కెట్లో మాత్రం రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకే రైతులు అమ్ముకుంటున్నారు. ప్రతి క్వింటాలుకు దాదాపు రూ. 2 వేలు నష్టపోతున్నారు అని లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు.
గతంలో బీ ఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో మద్దతు ధరకు రైతుల నుంచి సన్ఫ్లవర్ కొని రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే అధికారులను ఆదేశించి రాష్ట్రవ్యాప్తంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధరకు సన్ఫ్లవర్ కొని రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు.