తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్ఎస్ అధినేతకు అభినందనలు అందజేయడానికి వస్తున్న పలువురి రాకతో ఆదివారం ఆయన నివాసం సందడిగా మారింది. అసెంబ్లీ సెక్రెటరీ రాజా సదారం, సీనియర్ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ, టూరిజం శాఖ ఛీఫ్ సెక్రెటరీ చందనాఖాన్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జీఎంఆర్ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావు, మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్, ఒలింపిక్ షూటర్ గగన్ నారంగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్, తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల ఫోరం, తెలంగాణ ప్రిజన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేసీఆర్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఓయూలో కేసీఆర్ చిత్రపటానికి గిరిజన విద్యార్థి సంఘం, టీజీవీబీ, ఓయూ జేఏసీ విద్యార్థులు పాలాభిషేకం నిర్వహించారు.