తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమవంతు కృషి చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వంకుంట్ల కవిత మంగళవారం ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలు వేలాదిగా బయలుదేరి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టునుండి భారీ ర్యాలీ మధ్య కవితను ఊరేగింపుగా గన్ పార్క్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడకు చేరుకోగానే అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కవిత మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరులను స్వాతంత్ర్య వీరులుగా గుర్తిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం చేసిన వారి త్యాగాలు ఎంతో గొప్పవని, వారి కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటామని ఆమె అన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ, తెలంగాణ రావడానికి కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని, రాష్ట్ర విభజన కీర్తి ఆయనకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నేతలు, తెలంగాణ వాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్