mt_logo

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘనస్వాగతం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమవంతు కృషి చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వంకుంట్ల కవిత మంగళవారం ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలు వేలాదిగా బయలుదేరి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టునుండి భారీ ర్యాలీ మధ్య కవితను ఊరేగింపుగా గన్ పార్క్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడకు చేరుకోగానే అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కవిత మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరులను స్వాతంత్ర్య వీరులుగా గుర్తిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం చేసిన వారి త్యాగాలు ఎంతో గొప్పవని, వారి కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటామని ఆమె అన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ, తెలంగాణ రావడానికి కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని, రాష్ట్ర విభజన కీర్తి ఆయనకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నేతలు, తెలంగాణ వాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *