mt_logo

ఘనంగా టీ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు వేడుకలు నాంపల్లి కోర్టుకు చెందిన న్యాయవాదుల సమక్షంలో ఘనంగా జరిగాయి. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో కవిత చేసిన కృషిని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ తిరుపతివర్మ, కిరణ్, నాంపల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ పెట్టబోయే కొత్త పార్టీ పైన కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అన్న చిరంజీవి సామాజిక తెలంగాణ పేరుతో వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశాడని, ఇప్పుడు తమ్ముడు మరొక పార్టీ పేరుతో తెలంగాణకు వస్తున్నాడని విమర్శించారు. అప్పుడు చిరంజీవి మోసం చేసాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే వస్తున్నాడని అన్నారు. అన్న చిరంజీవి చేసిన తప్పులకు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే పార్టీ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. అసలు పవన్ ఏ మొహం పెట్టుకుని తెలంగాణలో పార్టీ పెడుతున్నారో క్లారిటీ ఇవ్వాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *