mt_logo

ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ- కవిత

మంగళవారం నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన రోడ్ షోలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఎంతోమంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలు, 14ఏళ్ల టీఆర్ఎస్ రాజీలేని పోరాటంతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించుకోవాలంటే వచ్చే అన్ని ఎన్నికల్లో ఉద్యమ పార్టీ అభ్యర్థులకే ఓటువేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమె పర్యటన సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలు, గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై దారిపొడవునా స్వాగతం పలికారు. తర్వాత ధర్పల్లిలోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని కవిత ప్రసంగించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ టీడీపీ, స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం తెలంగాణ అంశాన్ని వాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు ఓటువేస్తే ప్రయోజనం ఉండదని, కష్టపడి సాధించుకున్న తెలంగాణను దాచిదాచి దయ్యాలపాలు చేసినట్లుగా అవుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *