వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీ చేయనని, ప్రస్తుతానికి ఉద్యమ పాటగానే ఉంటానని ప్రజాగాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. వామపక్షాలు తనను ఎలాంటి నిర్దిష్టమైన విధానం, ప్రణాళిక లేకుండానే ఉప ఎన్నికలో పోటీ చేయాలని ప్రతిపాదించాయని, ఎన్నికల విధానం ఏంటో, మ్యానిఫెస్టో ఎలా ఉండాలో చర్చలే లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడదని తాను వారికి చెప్పానని గద్దర్ తెలిపారు. దీంతో వామపక్ష పార్టీలు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన అవసరం పడింది. ఇదిలావుండగా గద్దర్ ను సంప్రదించకుండానే వామపక్షాలు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాయి. ఈ విషయమై ఆయన ఇంటికి వెళ్లి ఉపఎన్నికలో పోటీ చేయాలని ఆహ్వానించగా పోటీ చేసే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలని గద్దర్ వారికి చెప్పారు. కానీ చివరకు గద్దర్ పోటీ చేయనని తాజాగా ప్రకటించడంతో వామపక్షాలకు మళ్ళీ అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- It’s not a money laundering case but a political laundering case: MLC Kavitha
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ
- 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు
- రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు
- అన్నదాతకు అండగా కేసీఆర్.. త్వరలో ఎండిన పంటల పరిశీలన
- నచ్చినోళ్లు జేబులో, నచ్చనోళ్లు జైల్లో.. ఇదే బీజేపీ వైఖరి: హరీష్ రావు