mt_logo

నిఖత్ జరీన్, ఈషాసింగ్‌కు రూ.2 కోట్ల నజరానా, ఇళ్ళస్థలాలు ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ నేతృత్వంలో పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య, అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌ను సీఎం కేసీఆర్‌ ఘనంగా సత్కరించారు. మొగులయ్యకు రూ.కోటి చెక్‌ అందజేశారు. క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌కు రూ.2 కోట్ల చొప్పున చెక్కులను అందించారు. అంతర్జాతీయ వేదికలపై పసిడి పతకాలతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన ఇద్దరు క్రీడాకారులకు నగదు ప్రోత్సాహంతో పాటు జూబ్లీహిల్స్‌ లేదా బంజారాహిల్స్‌లో నివాస స్థలాలు ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే మొగులయ్యకు హైదరాబాద్ లోని బీఎన్ రెడ్డి నగర్లోని నివాసయోగ్యమైన స్థలాన్ని అందజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *