నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలోని 105 మంది లబ్ధిదారులకు 42 లక్షల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బండ శ్రీనివాస్, పరిపాటి రవిందర్ రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డిలతో పాటు పలు గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీ లు పాల్గొన్నారు.