mt_logo

మాజీ సీఎం రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

మాజీ సీఎం రోశయ్య భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రోశయ్యకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివారం మధ్యాహ్నం కొంపల్లి ఫాంహౌస్‌లో అంత్యక్రియలు జరగనుండగా… ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించనుంది. కాగా ఆదివారం ఉదయం రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్‌లో సందర్శనకు ఉంచనున్నారు. అనంతరం గాంధీభవన్‌ నుంచి అంతిమయాత్ర సాగనుంది. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *