mt_logo

బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్..

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్ధికమంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టేకంటే ముందు పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవాన్లకు సభలోని సభ్యులంతా సంతాపం తెలిపారు. అమర జవాన్లకు నివాళి అనంతరం సభకు టీ విరామం ప్రకటించారు. సభ తిరిగి ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం బెజవాడ గోపాల్ రెడ్డి, ఉమ్మడి ఏపీలో కాసు బ్రహ్మానంద రెడ్డి, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నది సీఎం కేసీఆరే. స్వరాష్ట్రంలో బడ్జెట్ ప్రసంగం చేసిన తొలి సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *