mt_logo

సీఎం కేసీఆర్ ప్రాణాన్ని పణంగా పెట్టిన రోజు- రసమయి

ఈరోజు సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన రోజని, ఉద్యమంలో కేసీఆర్ ముందు నడిచి ప్రజలను భాగస్వామ్యులను చేశారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శాసనసభలో రసమయి మాట్లాడుతూ, ఈరోజు ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలని, ఐదేళ్ళ క్రితం ఇదేరోజు సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ నేతలు లేరని, ఈరోజే లేకుంటే మనమంతా ఇక్కడ ఉండేవాళ్ళం కాదని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *