హైదరాబాద్ నలుమూలలా ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందనున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రులకు భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్… అనంతరం అల్వాల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… భవిష్యత్లో కరోనాలాంటి మహమ్మారిలాంటి వైరస్లు వస్తాయని నిపుణులు చెప్పారని, వాటి నుండి కాపాడుకునేందుకు ఏం చేయాలంటే… ఒక రాష్ట్రం గానీ, దేశం గానీ, ఒక నగరం గానీ ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటదో వారు తక్కువ నష్టం బయటపడుతారనీ, వ్యవస్థ బాగా ఉండదో వాళ్లు నష్టాలకు గురై లక్షల మంది చనిపోతారని, వైరస్లను మొత్తం మెకానిజం ప్రపంచంలో లేదని, కంట్రోల్ చేసే వైద్య విధానం ఉందన్నారు. వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. మానవీయకోణంతో చాలా కష్టపడి.. పోరాడి.. ఆరుదశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి.. దీన్ని అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో పటిష్ట పరిచేందుకు సరైన పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు. ఈ రోజు మిగతా పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతుంటే, మనం మాత్రం కంటోన్మెంట్ సికింద్రాబాద్లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఎవరు చనిపోయినా వారింటికి తీసుకెళ్లేలా వాహనాలు ఏర్పాటు చేశామని, 50, 60 వాహనాలను ఏర్పాటు చేయాలని సీఎస్కు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య విధానాన్ని పటిష్ట పరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, పేదరకం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో 1.64కోట్ల జనాభా ఉందని, జనాభాకు అనుగుణంగా గాంధీ, ఉసాన్మియా కాకుండా మరో నాలుగు ఆసుపత్రులు ఉండాలని నిర్ణయించామని, ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు ప్రజలకు అందుతాయన్నారు. అల్వాల్ లో మహిళల ప్రసూతి వింగ్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు వైద్యశాఖకు సూచనలు చేశారు. హైదరాబాద్లో ఆరువేల పడకల ఆక్సిజన్ సౌకర్యం ఉందన్నారు. 1500 వరకు ఐసీయూ బెడ్స్ ఉండేలా ఆసుప్రతుల నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి గురికాకుండా ప్రజలు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యసేవలు పొందాలన్నారు
- Centre exhibits indifference towards Telangana in MGNREGS
- Has Congress govt’s irrigation water mismanagement led to drought in Telangana?
- KTR challenges Revanth Reddy to contest from Malkajgiri
- MP Ranjith Reddy betrayed BRS; will be defeated this time: KTR
- Revanth stirs a hornet’s nest by planning to scrap some districts in Telangana
- కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం.. పోరాట పంథాలో కదం తొక్కుతాం: కేటీఆర్
- ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేటీఆర్
- ఈటెల రాజేందరన్న హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చిండు: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండించిన హరీష్ రావు కార్యాలయం
- ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ
- 180 మంది రైతులు, 38 మంది ఆటో సోదరులు చనిపోతే కాంగ్రెస్ నుండి స్పందన లేదు: హరీష్ రావు
- రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీ ముఖ్యమంత్రా: హరీష్ రావు
- అన్నదాతకు అండగా కేసీఆర్.. త్వరలో ఎండిన పంటల పరిశీలన