mt_logo

విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ మూడో యూనిట్ కు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ పవర్ ప్లాంట్ ను రూ. 3,750 కోట్లతో నిర్మించనున్నారు. వచ్చే మూడు సంవత్సరాలలో ఈ విద్యుత్ ప్రజలకు అందుబాటులో రానుంది. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం తిలకించిన అనంతరం ఇప్పటివరకు జరిగిన పవర్ ప్లాంట్ నిర్మాణం పురోగతిపై సింగరేణి సీఎండీ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ ఓదెలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *