mt_logo

వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్..

వ్యవసాయ శాఖామంత్రిగా ఇవాళ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలై రైతులు అప్పులపాలు అయ్యారని, ప్రస్తుతం తెలంగాణలో ఆ పరిస్థితి లేదని చెప్పారు.

దూరదృష్టితో ముఖ్యమంత్రి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, రైతులను రాజులుగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. సాగునీటితో పాటు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రైతు బంధు దేశంలోనే గొప్ప పథకం. రైతుబంధు పథకంతో రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. తనపై బాధ్యత ఉంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నిరంజన్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *