mt_logo

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రూ. 5 లక్షల ఆర్ధికసాయం- సీఎం

సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం స్పష్టం చేశారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను, పశువులు కోల్పోయిన వారిని, ఇళ్ళను కోల్పోయిన వారిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని, అంతేకాకుండా పిడుగుపాటు, వడగండ్లు, భారీ వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్ధికసాయం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలవారీగా జరిగిన నష్టాల వివరాలను పంపాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ కార్యదర్శి మీనా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *