48 గంటల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవ్వాల్సి ఉండగా మంత్రి డి. శ్రీధర్బాబు శాఖ మార్చడం ద్వారా సీఎం ప్రవర్తిస్తున్న తీరు ఎంతో నీచమైన, హేయమైన చర్యగా తెలంగాణ వాదులు అభివర్ణిస్తున్నారు. ఇప్పుడున్న శాసనసభా వ్యవహారాల శాఖను మంత్రి శైలజానాథ్ కు అప్పగించి, వాణిజ్య పన్నుల శాఖను మంత్రి శ్రీధర్బాబు కు అప్పగించడం ద్వారా తనకున్న సీమాంధ్ర దురహంకారాన్ని మరోసారి బయట పెట్టారు సీఎం కిరణ్. ఇదిలా ఉండగా సీమాంధ్రకే చెందిన వట్టి వసంతకుమార్ ను తెలుగు భాష, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ ప్రోరోగ్, విభజన ముసాయిదా బిల్లుపై చర్చ మంత్రి శ్రీధర్బాబు మొదలుబెట్టడాన్ని సహించలేని ముఖ్యమంత్రి ఇలా చేయడాన్ని పలువురు టీ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనవరి 3నుండి ప్రారంభం కానున్న సమావేశాల్లో సీమాంధ్రకు చెందిన నాయకులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశబెట్టాలని ప్రయత్నిస్తున్నారనే వార్త తెలిసిన అన్నిపార్టీలకు చెందిన టీ నేతలు తీవ్రంగా ప్రతిఘటిస్తారని, తద్వారా సభను జరక్కుండా అడ్డుకొని ప్రోరోగ్ చేయాలని సీఎం కిరణ్ ఈ నిర్ణయం తీసుకోవడం యావత్ తెలంగాణ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. శాసనసభా వ్యవహారాలు సీమాంధ్రకు సంబంధించిన వ్యక్తి చేతిలో ఉంటే తాము చెప్పినట్లు జరుగుతుందని, సభలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలనే ఉద్దేశ్యం సీఎంకు ఉన్నట్లు పలువురి భావన. తెలంగాణ ప్రజలను మానసికంగా బలహీనుల్ని చేయడమే సీఎం కిరణ్ వ్యూహమని టీకాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఉపేక్షించేది లేదని, సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని తేల్చుకోవాలని అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు మంత్రి శ్రీధర్బాబుకు అండగా నిలిచారు. కొంతమంది టీకాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. మంత్రి శ్రీధర్బాబు శాఖ మార్పు గురించి తెలియగానే కరీంనగర్ బంద్కు టీకాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. శ్రీధర్బాబు కూడా ఈ విషయంపై తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నట్లు తోటిమంత్రులతో చెప్పినట్లు సమాచారం.
- Power tariff likely to be hiked from November, imposing huge burden on public
- EPW highlights Telangana’s outstanding debt and resource management during KCR’s rule
- The carrot-and-stick approach of Revanth Reddy’s media management
- BRS to fight until GO 29 is revoked: KTR
- BRS urges ERC to reject power tariff hike proposals
- ఆర్థిక నిర్వహణ, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్మెంట్లో తెలంగాణ టాప్: కేటీఆర్
- అరుదైన వ్యాధి ఉన్న మూడేళ్ల బాబుకు కేటీఆర్ స్ఫూర్తితో ఎమ్మెల్సీ పోచంపల్లి సాయం
- రూ. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది: ఈఆర్సీకి బీఆర్ఎస్ విజ్ఞాపన పత్రం
- Ministers, journalists visit Seoul’s waste-to-energy plant, though Hyderabad has 2 advanced facilities
- Education Commission advisory council expresses discontent with Congress govt.?
- హైదరాబాద్ను స్టార్టప్లకు కేరాఫ్ అడ్రస్గా తీర్చిదిద్దాం: ఇస్బాకాన్ సదస్సులో కేటీఆర్
- గ్రూప్-1 అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం: కేటీఆర్
- ఇంటర్నెట్ నుండి ఫోటోలు కాపీ కొట్టి పరువు పోగొట్టుకున్న రేవంత్ సర్కార్!
- మూసీ సుందరీకరణకు రూ. 1.5 లక్షల కోట్లు ఉన్నాయి.. రైతు భరోసాకు పైసలు లేవా?: కేటీఆర్
- జీవో 29 తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచిన రేవంత్: హరీష్ రావు