mt_logo

చంద్రబాబుకు ఆదివాసీలపై గౌరవం లేదు – ప్రొ. కోదండరాం

ఆదివాసీలపై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని, ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మద్దతు ఇచ్చేవారు కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో టీజేఏసీ, టీవీవీ భవిష్యత్ తెలంగాణలో మన కర్తవ్యం అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కోదండరాం విలేకరుల సమావేశంలో పోలవరం అంశంపై మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న ఏడు మండలాల ఆదివాసీలకు ప్రాజెక్టు కింద భూములను పంపిణీ చేసి ఆదుకోవాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ఆంధ్రా నేతలకు తలొగ్గి కేంద్రం పోలవరం ఆర్డినెన్స్ ను ఇంత హడావిడిగా చేయడం అప్రజాస్వామికమని, ఆదివాసీలది బతుకు సమస్య అని, అందుకే టీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపుకు అన్ని వైపులనుండి సంపూర్ణ మద్దతు లభించిందని కోదండరాం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *