mt_logo

కార్టూనిస్ట్ మృత్యుంజయ్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం

తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబించే విధంగా, నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్టూనిస్టు గా మృత్యుంజయ గీసిన కార్టూన్ల సంకలనం…ఉద్యమ గీత.. పుస్తకాన్ని బుధవారం ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. దాంతోపాటు, కార్టూనిస్టుగా 25 ఏండ్ల కాలంలో మృత్యుంజయ గీసిన కార్టూన్లు మరియు క్యారికేచర్ల ఇంగ్లీషు సంకలనం…ఎకోస్ ఆఫ్ లైన్స్.. పుస్తకాన్ని కూడా సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. ఈ చిత్రంలో..  సిఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, పుస్తకాల రచయిత కార్టూనిస్టు చిలువేరు మృత్యుంజయ, పుస్తకాల సంపాదకుడు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ లున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *