![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2024/02/inshot_20240229_142832107919403679003954746.jpg?resize=1024%2C575&ssl=1)
సోయాబీన్ మరియు శనగ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు జైనథ్లో ధర్నా నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మొండి వైఖరిని వీడి మద్దతు ధరతో సోయాబీన్ మరియు శనగ పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రభుత్వం ఇకనైనా స్పందించకుంటే రైతుల పక్షాన నిరంతర నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆదేశానుసారం ఈ ధర్నా నిర్వహించారు.