mt_logo

భూభారతి పత్రికా ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీఆర్ఎస్

శాసనసభ ఆమోదం పొందని భూభారతి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం చట్టంగా ప్రకటిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ శాసనసభపక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.

భూభారతి చట్టం అని పేర్కొంటూ పత్రికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్  సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. శాసనసభా హక్కుల రక్షణ కోసం స్పీకర్‌కు వినతి పత్రం అందించింది.

ఇంకా ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటిస్తూ..  దినపత్రికల్లో భూభారతిపై ప్రకటనలు జారీ చేసిన ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పార్టీ అగ్రహం వ్యక్తం చేసింది.

పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందన్న బీఆర్ఎస్.. శాసనసభలో చర్చ దశలో ఉన్న బిల్లును ప్రభుత్వం చట్టంగా ఎలా పేర్కొంటుంది అంటూ ప్రశ్నించింది.