అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్కు దమ్ముంటే ఫార్మూలా-ఈ తోపాటు ప్రభుత్వం చేస్తున్న స్కాంలపైన అసెంబ్లీలో చర్చ పెట్టాలి. కానీ రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చకు పెట్టే దమ్ములేదు అని దుయ్యబట్టారు.
మీ అరోపణలపై సభలో వివరాలు ఇవ్వండి.. ప్రజల ముందు నిజాలు ఉంచండి. అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయించుకుంటారు. రేవంత్ రెడ్డి లీకులిచ్చి రాజకీయ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. ఫార్ములా ఈ, ఇతర స్కాంలంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్న సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయి అని సవాల్ విసిరారు.
చర్చ నాలుగు గోడల మద్య కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. లీకువీరుడు సీఎం ఇచ్చే లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పే దమ్ములేదు ఫార్ములా-ఈ రేసులో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు న్యాయంగా వ్యవహరించే, ప్రభుత్వ అరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వేంటనే కేసు కొట్టేస్తారనే నమక్మముంది అని అన్నారు.
అధికారికంగా చెప్పే దమ్ములేక క్యాబినెట్లో నాలుగు గంటల చర్చ అంటూ వార్తలు రాపిస్తున్నారు. క్యాబినెట్ అంటే గాసిప్ బ్యాచ్ లెక్క తయారైంది. నిజాలు చెప్పే దమ్ము లేక సీఎస్తో నోటీసులు, అనుమతులు అంటూ లీకులిస్తున్నారు అని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరకిస్తున్నాం. ఈ చట్ట సవరణ వలన బీసీలకు పూర్తి అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఇచ్చిన 42 శాతం హమీ గంగలో కలిసినట్టే అవుతుంది. ఎన్నికల కోసం హమీలిచ్చి ఇప్పుడు 2010 సుప్రీం కోర్టు కేసును చట్టంలో ప్రస్తావిస్తుంది అని పేర్కొన్నారు.
42శాతం రిజర్వేషన్లును పక్కన పెట్టేలా ప్రత్యేక బీసీ కమీషన్ సిఫార్సులు, ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి అంటూ కొత్త మెలికలు పెడుతుంది. ఈ అంశంలో అన్ని పార్టీల మద్దతున్న నేపత్యంలో.. ఈ చట్ట సవరణలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని నిబంధనలు పెట్టండి.. చట్టం చేయండి కోర్టుల అంగీకరించకుంటే అవసరం అయితే రాజ్యంగ సవరణ కోసం కేంద్రానికి పోదాం అని పిలుపునిచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ కలిసి పార్లమెంట్లో రాజ్యంగ సవరణ చేయవచ్చు. ఈ మేరకు నేరుగా చట్టంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని సవరణలు కోరాం. ఈ అంశంలో సభలో ఓటింగ్/డివిజన్ అడుగుతాం. ఒకవేళ ఈ చట్టం అమలు అయితే బీసీలకు రిజర్వేషన్లు దక్కవు అని అన్నారు.