mt_logo

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. క‌ర్మ‌న్‌ఘాట్ ఆంజ‌నేయ స్వామి ఆలయం వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన రఘునందన్ ను, ఎల్బీనగర్ టోల్ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని ఘ‌ట్‌కేస‌ర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా నేడు కర్మన్ ఘాట్ ఆలయం వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాకు పోలీసులు ఇవ్వలేదు. మతపరమైన స్థలం వద్ద ధర్నాలు చేపట్టడం వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున పోలీస్ శాఖ వారు అనుమతి నిరారించారు. ఈ క్రమంలో టెంపుల్ వద్దకు వస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను ముందుగానే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అలాగే ఆలయం వద్ద పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *