mt_logo

ఫిబ్రవరి 26లోగా దేశం విడిచి వెళ్ళాల్సిందే!!

ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్ట్ అయిన 16 మంది విద్యార్థులకు అమెరికా కోర్టులో ఊరట లభించింది. ఫిబ్రవరి 26 లోగా దేశం విడిచి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే 20 మందిలో ముగ్గురు విద్యార్ధులు(ఇద్దరు ఇండియన్స్, ఒక పాలస్తీనియన్) ముందుగానే డిపార్చర్(స్వచ్చందంగా స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు) అనుమతి పొందారు. ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్టు అయిన విద్యార్ధుల తుది వాదనలు ఫిబ్రవరి 12న ముగిసాయి.

20 మందిలో 17మందిపై మంగళవారం విచారణ జరిగింది. 17 మందిలో 15 మందికి స్వచ్చందంగా స్వదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కోర్టు కల్పించింది. 15 మందిలో 8 మంది తెలుగు విద్యార్థులే. 16వ విద్యార్ధికి కూడా తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఇచ్చినప్పటికీ స్వచ్చందంగా కాకుండా యూఎస్ గవర్నమెంట్ రిమూవల్ కింద వెళ్లేందుకు అనుమతించింది. 17వ విద్యార్ధి అమెరికా పౌరసత్వం ఉన్న మహిళను పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల అతడు బెయిల్ బాండ్ కోసం అప్లై చేసుకున్నాడు.

మొత్తం 16 మంది విద్యార్థులు కోర్టు తీర్పు మేరకు వాలంటరీగా ఫిబ్రవరి 26లోగా యూఎస్ వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. విద్యార్ధులు కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మొదటినుండీ ఆటా-తెలంగాణ అసోసియేషన్ అటార్నీలను ఏర్పాటు చేసి విద్యార్ధులకు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. వీరి తిరుగు ప్రయాణానికి సహకరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *