mt_logo

వరద నీటిలో చిక్కుకున్న గ్రామం.. డ్రోన్ ద్వారా మందులు అందజేసిన అధికారులు

జలదిగ్భందంలో చిక్కుకున్న ఓ గ్రామంలోని పసి బాలునికి డ్రోన్ ద్వారా మందులు అందించింది అధికార యంత్రాంగం. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కుర్తి గ్రామం నాలుగు రోజులుగా వరద నీటిలో చిక్కుకుపోయింది. ఈ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న పాత వంతెన పైనుంచి భారీగా వరద ప్రవహిస్తూ.. ఇతర గ్రామాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా సోమవారం కుర్తి గ్రామానికి చెందిన ఓ 18 నెలలు బాలుడు కడుపునొప్పితో బాధపడ్డాడు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు ఫోన్‌ ద్వారా వివరించగా.. వారు రెవెన్యూ, వైద్యాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన అధికార యంత్రాంగం బాబుకు కావాల్సిన మందులను డ్రోన్‌ సహాయంతో కుర్తి గ్రామంలోని కుటుంబానికి అందించారు. మందులు అందడానికి చొరవ చూపిన స్థానిక వైద్యాధికారికి, తహసీల్దార్‌ మరియు ఇతర ప్రజాప్రతినిధులకు తల్లిదండ్రులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *