mt_logo

అన్ని వర్గాలకూ టీఆర్ఎస్ సంపూర్ణ సహకారం- కేసీఆర్

శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీకి ఈ వర్గం, ఆ వర్గం అంటూ భేదాలు లేవని, ప్రజలందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 11 నెలలే అయ్యిందని, ఈ వ్యవధిలోనే అనేక కార్యక్రమాలు ప్రజలముందుకు తెచ్చామని, ఇంకా చాలా కార్యక్రమాలు రాబోతున్నాయని చెప్పారు. పార్టీ కార్మికులకు, కష్టజీవులకు, రైతులకు అండగా ఉంటుందని, సిర్పూర్ కాగజ్ నగర్ లో పేపర్ మిల్లు, వరంగల్ లోని రేయాన్ పరిశ్రమలను ఆదుకుంటామని, ఇలా ఎక్కడ ఏ పరిశ్రమ మూతబడినా చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

పంట నష్టపోయిన తెలంగాణ రైతు సోదరులందరికీ ఆర్ధికసాయం అందిస్తాం.. మీరెవరూ చిన్నబుచ్చుకోవద్దు.. ప్రతి ఎకరాకు ఖచ్చితంగా సహాయాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పంట నష్టానికి సంబంధించి నివేదికలు పంపాలని కలెక్టర్లను ఆదేశించామని, నివేదికలు రావడమే ఆలస్యం, పంట నష్టానికి సంబంధించి ప్రతి రైతుకు సహాయం అందుతుందని భరోసా కేసీఆర్ ఇచ్చారు. ప్రపంచ దేశాల్లోకి టీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తుందని, లండన్ లో పార్టీ శాఖను ఏర్పాటు చేసి తెలంగాణ విశిష్టతను చాటిచెప్తున్న అనిల్ కూర్మాచలాన్ని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. అంతేకాకుండా అమెరికాలో కూడా టీఆర్ఎస్ ఎంపీ కవిత, అనిల్ కూర్మాచలం టీఆర్ఎస్ శాఖలు ఏర్పాటు చేసేందుకు కృషి చేశారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *