ఐదు రోజులుగా క్రీడాభిమానులను అలరించిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) సహకారంతో ఓరుగల్లు వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో.. రైల్వేస్ 253.5 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. పురుషుల విభాగంలో ప్రవీణ్ చిత్రవెల్, మహిళల ఈవెంట్లో హర్మిలన్ కౌర్ బైన్స్ ఉత్తమ అథ్లెట్ ట్రోఫీలు చేజిక్కించుకున్నారు. మొత్తం 23 జట్లు పాల్గొన్న ఈ మెగాటోర్నీలో 18 జట్లు పతకాల పట్టికలో చోటు దక్కించుకోగా.. 13 స్వర్ణాలతో సహా 36 మెడల్స్ తో రైల్వేస్ టాప్లో నిలవగా, ఏడు స్వర్ణాలు సహా 16 మెడల్స్ సాధించిన తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. పోటీల అనంతరం జరిగిన ముగింపు వేడుకల్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ విజేతలకు బహమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్ఛేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..వరంగల్లో స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ను ఒప్పించి 50 ఎకరాల స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ పోటీలు వరంగల్ ప్రతిష్టను మరింత పెంచాయని కొనియాడారు. మరో ముఖ్య అతిథి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్ను క్రీడాహాబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్ల సహకారంతో కృషి చేయనున్నట్లు తెలిపారు.
- People fed up with Congress misrule, says KCR
- KCR advises BRS leaders to focus on social media
- Ahead of Lok Sabha polls, Congress facing discontent from Telangana farmers
- BJP’s proposal for Godavari-Kaveri river linking project puts Telangana at risk
- C-PAC, which got TS assembly results right, predicts 8 seats for BRS in LS polls
- కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. యువతకు కాంగ్రెస్ చేసిన ద్రోహంపై కేటీఆర్ ధ్వజం
- అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేలకు దిగిరావాలంటే వినోదన్న గెలవాలి: హరీష్ రావు
- 2001 లోనే హైదరాబాద్లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్: కేటీఆర్
- కాంగ్రెస్కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్
- ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణించడం దురదృష్టకరం: హరీష్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
- సివిల్స్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలను అభినందించిన కేటీఆర్
- భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల బాలుడి మరణం ప్రభుత్వ హత్యే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలె వాళ్ళకి గడ్డపారలు అవుతాయి: హరీష్ రావు
- తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్ఎస్సే: కేసీఆర్