mt_logo

తెలంగాణలో 2 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బుధవారం నాటికి రాష్ట్రంలో 2 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రభుత్వ ప్రత్యేక కేంద్రాల ద్వారానే కాకుండా, మొబైల్ సెంటర్ల ద్వారా కూడా వ్యాక్సినేషన్ వేస్తున్నారు. తద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంది. ఈ సందర్బంగా తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేక్ కట్ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని సీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *