mt_logo

250 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న ఎన్టీపీసీ..

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ తెలంగాణలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టనుంది. పెద్ద ఎత్తున సోలార్, పవన విద్యుత్ ను ఉత్పత్తి చేయాలన్న కేంద్రం లక్ష్యాలకు అనుగుణంగా ఎన్టీపీసీ సోలార్ విద్యుత్ సామర్ధ్యాన్ని వచ్చే ఐదేండ్లలో 10 వేల మెగావాట్లకు పెంచుకోవాలనుకుంటున్నది. ఇందుకోసం రూ. 60 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే ఈ సంస్థ 110 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. తాజాగా 250 మెగావాట్ల సామర్ధ్యంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కో ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు, వీటికి సంబంధించి టెండర్లను కూడా పిలిచినట్లు ఎన్టీపీసీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *