mt_logo

జర్నలిస్టులకు రూ.1 కోటీ 28లక్షల 60 వేలు ఆర్ధికసాయం..

రాష్ట్రంలో ఇప్పటి వరకు  కరోనా వైరస్ బారిన పడిన 686 మంది జర్నలిస్టులకు 1కోటి 28లక్షల 60వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

వీరిలో పాజిటివ్ వచ్చిన 600 మంది జర్నలిస్టులకు ఇరవై వేల రూపాయల చొప్పున, ఒక కోటి 20 లక్షల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 86 మంది జర్నలిస్టులకు పది వేల రూపాయల చొప్పున 8 లక్షల 60 వేల రూపాయలను అందిచామని తెలిపారు. మొత్తంగా అందరికీ ఒక కోటి 28 లక్షల 60 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

శుక్రవారం నాటికి వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 73 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు నిర్థారించారు. ఈ 73 మంది జర్నలిస్టులకు 14 లక్షల 60 వేల రూపాయలు ఆర్థిక సహాయం జర్నలిస్టుల ఆన్లైన్ ఎకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు.

జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ వాట్సప్ (8096677444) నెంబర్ కి పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ సెల్ నెంబర్ 9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *