mt_logo

26న హైదరాబాద్ రానున్న కేసీఆర్ కు ఘనస్వాగతం

ఆరు దశాబ్దాలకుపైగా పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజల కల సాకారంచేయడంలో తీవ్ర కృషి చేసి విజయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 26వ తేదీన డిల్లీ నుండి హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ వచ్చాకే హైదరాబాద్ లో అడుగుపెడతానని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన మాట తప్పకుండా తెలంగాణ సాధించి చూపించారు. ఈ క్రమంలో ఆయనకు ఘనస్వాగతం తెలపడానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ నెల డిల్లీ నుండి విమానంలో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని అక్కడినుండి బేగంపేట విమానాశ్రయానికి హెలికాప్టర్లో రానున్నారు. అక్కడ ఆయనకు వేయి మంది బ్రాహ్మణులతో పూర్ణకుంభ స్వాగతం పలికి సర్వమతప్రార్ధనలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ర్యాలీ ప్రారంభమై గన్ పార్క్ కు చేరుకుంటుంది. అక్కడ అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళి అర్పించనున్నారు. తర్వాత తెలంగాణ భవన్ కు చేరుకుని తెలంగాణ తల్లి, జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించనున్నారు. ఈ ర్యాలీలో లక్షలాది మంది కాలినడకన ర్యాలీగా వస్తారని, చరిత్రలో నిలిచిపోయేలా ఈ ర్యాలీ ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాకు వివరించారు. కేసీఆర్ రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలతోపాటుగా యువకులు, విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఉద్యోగులు భారీ ర్యాలీలో పాల్గొంటారని హరీష్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *