mt_logo

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాం..

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన శాసనమండలి సమావేశాల్లో మంత్రి పోచారం మాట్లాడుతూ, జూన్ 2 నుండి ఇప్పటివరకు 55 మంది రైతులకు రూ. లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించామని, ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలకు సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలకు కూడా తాము ఎక్స్ గ్రేషియా చెల్లించామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాలను కడుగుతున్నామని, తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని పోచారం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *