mt_logo

లోక్ సభ ఎన్నికలు ఏకపక్షమే- ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఏకపక్షమే అని, వరంగల్ లో 5 లక్షల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పసునూరి దయాకర్ ఇవాళ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ రెండు లోక్ సభ స్థానాలతోనే కేసీఆర్ తెలంగాణ సాధించారు. ఈ ఎన్నికల్లో 16 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించి ఢిల్లీలో చక్రం తిప్పుతారు. 17 మంది ఎంపీలను గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుంది. వరంగల్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.

అనంతరం పసునూరి దయాకర్ మాట్లాడుతూ రెండో సారి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాదు. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *