mt_logo

అమరవీరుల కృషి ఫలితమే ఈ విజయం- ప్రొ.కోదండరాం

లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రోఫెసర్ కోదండరాం మిగతా జేఏసీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ విజయం అమరవీరులకు అంకితమని, తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకున్న అమరవీరుల సూసైడ్ నోట్ లను తెలంగాణ పునర్నిర్మాణంలో ఎజెండాగా చేసుకుని ముందుకు పోతామని అన్నారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితమే రాష్ట్ర ఏర్పాటు అని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం అందరం సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు. రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లును ఆమోదించాలని కోదండరాం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. లోక్ సభలో తెలంగాణ బిల్లును ఆమోదింపచేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు పేరుపేరునా జేఏసీ తరపున ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ కల నెరవేరడం చరిత్రాత్మక విజయమని అన్నారు. ఇన్నాళ్ళూ తెలంగాణలో ఉంటూ ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వారికి శిక్ష తప్పదని తెలంగాణ జేఏసీ కోచైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సిద్ధించిందని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *