mt_logo

తెలంగాణ కొరకు వేనేపల్లి “నిరాగ్రహం”

తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తనదైన శైలిలో ఉద్యమించే వేనేపల్లి పాండురంగారావు ఈసారి మరో విన్నూత్న ప్రయత్నం చేశాడు. సంక్రాంతి పండుగకు సీమాంధ్రకు వెళ్లి తిరిగివచ్చే వారికి అవగాహన కల్పించేందుకు 24 గంటల నిరసన దీక్షను “నిరాగ్రహం” పేరుతో నిర్వహించాడాయన.

NH-9 రహదారిపై ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు గ్రామం నల్లబండగూడెం వద్ద తెలంగాణ మట్టి మనుషుల వేదిక ఆధ్వర్యంలో వేనేపల్లి పాండురంగారావు ఈ దీక్షను నిర్వహించారు.

ఈ సందర్భంగా వేనేపల్లి మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు కుట్రలు పన్నొద్దని, విడిపోయేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జే.ఏ.సి, టీఆరెస్, బీజేపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *