mt_logo

రేపటినుండి 33 జిల్లాలు!!

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలకు తోడుగా మరో రెండు జిల్లాలు రేపటినుండి అందుబాటులోకి రానున్నాయి. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33 కు చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారాయణ పేట, ములుగు లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నారయణ్ పేట్, ములుగును కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను ఇవాళ విడుదల చేసింది. దీంతో రేపటినుండి ములుగు, నారాయణ్ పేట్ లు కొత్త జిల్లాలుగా రూపొందనున్నాయి.

9 మండలాలతో ములుగు జిల్లాను, 11 మండలాలతో నారాయణ పేట జిల్లాను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లా పరిధిలోకి నారాయణ పేట, దామరగిద్ద, మరికల్, ధన్వాడ, కోస్గి, మద్దూరు, నర్వ, ఉట్కూర్, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలు రానున్నాయి. ములుగు జిల్లా పరిధిలోకి ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి(సమ్మక్క, సారక్క), ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట్, వెంకటాపురం, వాజేడు మండలాలు రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *