mt_logo

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటాలి-కేసీఆర్

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించి రాజకీయ పార్టీగా పేరొందాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో సమావేశమై మున్సిపల్ ఎన్నికల విషయమై చర్చించారు. ఈ ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి విజయం సాధించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని, అందులో కూడా ఘన విజయం సాధించి రాజకీయ పార్టీగా వెలుగొందాలని సమావేశంలో చర్చించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో, ప్రచార బాధ్యతలను అప్పగించే విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రచార బాధ్యతలను పార్టీ నేతలు కేకే, ఈటెల, హరీష్ రావు, ఎంపీలు మందా జగన్నాథం, వివేక్ లకు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *