గురువారం మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో జరిగిన బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక మొదటిసారి పాలమూరు జిల్లాలో అడుగుపెట్టానని, ఇక్కడి నేలకు, ప్రజలకు వందనం చేస్తున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, 10 మంది ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రం నుండి నిధులు సాధించుకుని తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చని పేర్కొన్నారు. మెదక్ జిల్లా వాసినైనా తెలంగాణ ఉద్యమ సృష్టికర్త జయశంకర్ స్ఫూర్తితోనే తాను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందానని గుర్తుచేశారు. ఏ జిల్లాలో పోటీ చేసినా కేసీఆర్ కు అన్ని జిల్లాల ప్రజలూ అండగా ఉంటారని పాలమూరు ప్రజలు నిరూపించారని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇక పాలమూరు సస్యశ్యామలం అవుతుందని, పాలమూరు పచ్చబడే వరకూ నిద్రపోనని అన్నారు. 2002 లో ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేసినప్పుడు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్డీఎస్ తూములను పేల్చేస్తానని ప్రజలను భయపెట్టాడని, ఆర్డీఎస్ ను పేల్చేస్తే సుంకేసుల ప్రాజెక్టును బద్దలుకొడతామని తాను హెచ్చరించినట్లు గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలిచాక ఏడాదిలో కేసీఆర్ దెబ్బ ఏంటో చూపిస్తానని, ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు దగ్గరుండి నీరు పారిస్తానని, ఎవరడ్డం వచ్చినా ఊరుకోనని హెచ్చరించారు. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని, ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వారి అభివృద్ధికై కృషిచేస్తామని హామీ ఇచ్చారు. గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డిని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ భార్యను ప్రకటిస్తూ వారిని గెలిపించాలని కేసీఆర్ సభలో పాల్గొన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్
