mt_logo

క్రైస్తవ సమాజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది- కేటీఆర్

హైదరాబాద్ బంజారాహిల్స్ లో బిషప్ లు, క్రైస్తవ ప్రముఖులతో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేద దేశాల్లో క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న సేవలు మరువలేనివని, కొన్ని మిషనరీలు దశాబ్దాలుగా విద్య, వైద్య రంగంలో ఎనలేని కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. ఎక్కడ విపత్తులు సంభవించినా సేవలు అందించడానికి క్రైస్తవ సమాజం ముందుంటుందని, విపత్తుల వేళ కూడా సేవ, సహాయం అందిస్తున్నారని అన్నారు. క్రైస్తవ సమాజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ హిందూ ధర్మాన్ని బలంగా నమ్ముతారని, అదే సమయంలో ఇతరుల నమ్మకాన్ని కూడా గౌరవిస్తారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు. స్వరాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధుల కోసం 940 గురుకులాలు ఏర్పాటు చేశామని, ఈ గురుకులాల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ఒక్కో విద్యార్థిపై రూ. 1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. చైనా కంటే మనం వెనుకబడి ఉన్నామని, మౌలిక వసతుల కల్పన లేకుండా ఎంత అభివృద్ధి జరిగినా అది వృధా అవుతుందని అన్నారు. తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని, తెలంగాణ జీఎస్డీపీ ఆరేళ్లలోనే రెట్టింపు అయిందని, ఇన్నోవేషన్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *