mt_logo

తెలంగాణ విజయం అమరవీరులకు అంకితం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అమరవీరుల విజయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించడానికి ఆయన డిల్లీ నుండి రాగానే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలానికి సోమవారం చేరుకున్నారు. పెద్దమంగళారంలో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన మందడి యాదిరెడ్డి సమాధివద్దకు చేరుకొని నివాళులర్పించారు. పార్లమెంటు ముందు ఆత్మబలిదానం చేసుకుని యాదిరెడ్డి డిల్లీ పీఠాన్ని కదిలించారని ఈటెల అన్నారు. అమరవీరుల కుటుంబాలను సందర్శించినవారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రౌతు కనకయ్య తదితరులు ఉన్నారు. యాదిరెడ్డి తల్లి చంద్రమ్మకు ఎమ్మెల్యే హరీష్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లక్ష రూపాయల ఆర్ధికసహాయం అందజేశారు. అదేవిధంగా మరికొందరు అమరుల కుటుంబాలకు కూడా ఆర్ధిక సహాయాన్ని అందించారు. చాకలిగూడకు చెందిన మహేష్ భార్య రజితకు 75వేలు, అజీజ్ నగర్ గ్రామానికి చెందిన సరిత తండ్రి నర్సింహులు కు, చేవెళ్ళ మండలానికే చెందిన మంగలి జంగయ్య భార్యకు ఆర్ధిక సహాయం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *