mt_logo

త్వరలో అన్ని రకాల రైతు రుణమాఫీలు – హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల రైతులకు సంబంధించిన 18వేల కోట్ల రుణాలను మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, అన్ని రకాల రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీష్ రావు స్పష్టం చేశారు. మెదక్ జిల్లా అభివృద్ధిపై సంగారెడ్డిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి హరీష్ తో పాటు స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, రామలింగారెడ్డి, చింతాప్రభాకర్, మహిపాల్ రెడ్డి, మదన్ రెడ్డి, గీతారెడ్డి, మెదక్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రెండు, మూడు నెలల్లో రుణమాఫీ అమల్లోకి వస్తుందని, ఖరీఫ్ సీజన్ లో రైతులకు తిరిగి రుణాలు అందించే విషయమై బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. పాత రుణాలు మాఫీ చేస్తూనే కొత్త రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని, మెదక్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. రైతు రుణాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞత తీర్మానాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రవేశపెట్టగానే, ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ దాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *