mt_logo

ఏ పల్లెను తట్టినా జై తెలంగాణ నినాదాలే

తెలంగాణ ఉద్యమంలో ఆదివాసీల పాత్ర మరువలేనిదని, పోలవరంతో ఆదివాసీలు ఉనికి కోల్పోతారని, ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంవల్ల వారి మనుగడ ప్రశ్నార్థకమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా గుండాలలో అమరవీరుల స్తూపాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాక విలేకరులతో మాట్లాడుతూ, పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటామని, అమరులైన విద్యార్థులకు మారుమూల గ్రామాల్లో స్తూపం ఏర్పాటు చేయడం ఎంతో ప్రశంసించదగ్గది అని వ్యాఖ్యానించారు. ఏ పల్లెను తట్టిలేపినా జై తెలంగాణ అనే నినాదమే వినిపిస్తున్నదని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్, బీజేపీ కీలక పాత్ర పోషించాయని, ఖమ్మం జిల్లా ఇల్లందులో న్యూ డెమోక్రసీ పాత్ర మర్చిపోలేనిదని గుర్తు చేశారు. తెలంగాణ జేఏసీ పొలిటికల్ పార్టీగా మారదని, పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డి. రాజేందర్, న్యూ డెమోక్రసీ సభ్యులు, పలువురు తెలంగాణ వాదులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *