mt_logo

తెలంగాణ ప్రభుత్వం ధర్నాలకు భయపడదు- హరీష్ రావు

తెలుగుదేశం సభ్యులు బయట ధర్నాలు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ధర్నాలకు భయపడదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో ఈరోజు ఆర్ధిక పద్దులపై చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీ సభ్యుడు డా. లక్ష్మణ్ మాట్లాడుతూ సభా సమయం ఇంకా రెండు రోజులే మిగిలిఉందని, తెలుగుదేశం పార్టీ సభ్యులపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయాలని స్పీకర్ ను కోరగా దీనిపై స్పందించిన స్పీకర్ ఈ విషయం పరిశీలనలో ఉందని, సభ్యులు స్పీకర్ కు సూచనలు చేయాలే తప్ప డిక్టేట్ చేయకూడదని సూచించారు. అయినా లక్ష్మణ్ వినకపోవడంతో హరీష్ రావు స్పందిస్తూ సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్తుందని, పక్క రాష్ట్రంలో టీడీఎల్పీ మీటింగ్ లా అసెంబ్లీ జరుగుతుందని, జాతీయ గీతాన్ని అవమానించినందుకే వారిని సస్పెండ్ చేశామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *