తెలంగాణ అంశాన్ని ఈ సమావేశాల్లోనే తేల్చేస్తే మంచిదని, 14వ లోక్సభలో ఆమోదం పొందకపోతే 15వ లోక్సభలో ఇదే అంశం ఉంటుందని, అప్పుడూ తేలకపోతే 16వ లోక్సభలో కూడా ఉంటుందని ఆర్ధిక మంత్రి చిదంబరం సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నారు. అందువలన బిల్లును ఓడించడమో, ఆమోదించడమో వెంటనే జరిగిపోవాలి అని ఆయన స్పష్టం చేశారు. బిల్లు ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరిగిందని, రాష్ట్ర శాసనసభ వ్యతిరేకించినా పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని ఏ రాజకీయ పార్టీలు అడ్డుకోలేవని చిదంబరం వ్యాఖ్యానించారు. తర్వాతి లోక్సభలో కూడా అన్ని పార్టీల ఎంపీలు తెలంగాణ నుండి 17, సీమాంధ్ర నుండి 25 మంది ఉంటారని, సమస్య ఇలాగే ఉంటుంది కాబట్టి తెలంగాణ బిల్లును ఎప్పటికీ అడ్డుకోలేరని హెచ్చరించారు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వ అజెండాలో అత్యధిక ప్రాధాన్యం ఉన్న అంశమని, ఓటు ద్వారా కాకుండా సభను అడ్డుకుని సమావేశాలు జరగకుండా ఆటంకపరిచే వారిపై కఠిన చర్యలు తప్పవని కమల్ నాథ్ హెచ్చరించారు. సభను అడ్డుకునే ఎంపీలపై చర్యలు తీసుకోమని స్పీకర్ ను కోరుతామన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందకూడదని ఎవరైనా భావిస్తే వారు వ్యతిరేకంగా ఓటు వేయొచ్చుగానీ, సభను మాత్రం అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ బిల్లుతో పాటు ఇతర అన్ని బిల్లులకూ తాము మద్దతు తెలుపుతామని, సభను అడ్డుకోకుండా చూసే బాధ్యత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని సూచించారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్