mt_logo

ఢిల్లీ వీధుల్లో తెలుగుదేశం ఎంపీల చిల్లరవేషాలు

ఒక దారీ తెన్నూ లేకుండా సాగుతున్న సీమాంధ్ర ఆందోళనలను అటు సీమాంధ్ర మీడియా, ఇటు సీమాంధ్ర నాయకులు ఇంకొంచెం నవ్వులపాలు చేస్తున్నారు. సీమాంధ్రలో కొందరు ఆకతాయిలు చేస్తున్న అల్లరి చేష్టలనే ఉద్యమంగా చూపిస్తూ సీమాంధ్ర మీడియా వినోదం పంచుతోంటే, తామేం తక్కువ తినలేదని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు చట్టసభల వేదికగా వినోదం పండిస్తున్నారు.

నిన్న లోక్ సభకు తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ కృష్ణుడి వేషంలో రావడంతో పలువురు ఎంపీలు ముక్కున వేలేసుకున్నారు. తానొక లోక్ సభలో సభ్యుడినన్న కనీస ఇంగితజ్ఞానం లేకుండా పగటివేషం కట్టి పైగా అదొక నిరసన రూపం అని చెప్పుకోవడం చూసి ఇతర రాష్ట్రాల ఎంపీలు నవ్వుకున్నారు. స్పీకర్ కూడా ఈ విచిత్ర వేషధారణ చూసి విసుక్కున్నాడు. నెత్తికో కిరీటం, మెడలో చెమికీ దండ, చేతిలో పిల్లనగ్రోవితో శివప్రసాద్ పగటివేషం, అసలే మసకబారిన తెలుగుదేశం ప్రతిష్టను ఇంకొంచెం దిగజార్చింది.

మాట్లాడితే తెలుగు జాతి ఆత్మగౌరవం, పరువు అని డైలాగులు కొట్టే తెలుగుదేశం పార్టీ ఎంపీలే ఈ చిల్లరవేషాలతో తెలుగుజాతి పరువు ఢిల్లీ వీధుల్లో మంటగలుపుతున్నారని వేరే చెప్పాలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *